Suryaa.co.in

Andhra Pradesh

వినాయక చవితి నిమజ్జనం ఎప్పటిలాగే ఘనంగా జరుపుకోవడానికి పోలీసు శాఖ సహకారం

– డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

పోలీస్ శాఖ వినాయక నిమజ్జనం కొరకు ఎటువంటి ప్రత్యేక ఆంక్షలు విధించటం లేదనీ, ప్రజలు ఎప్పటిలాగే వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకోవాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి అభిలషించారు. వినాయక నిమజ్జన సమయంలో భద్రత దృష్ట్యా పోలీసు శాఖ ప్రతి సంవత్సరం కొన్ని సూచనలు ఇవ్వటం ఆనవాయితీ. అంతకు ముందు ఇచ్చిన సూచనలు జతపరుస్తున్నాం. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు లోను కావద్దని విన్నపం. అదేవిధంగా ఈ విషయంలో ఎటువంటి రాద్ధాంతం చేయవద్దని మనవి.

ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆర్గనైజయింగ్ కమిటీ ఎటువంటి అఫిడవిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రింది స్థాయి సిబ్బంది నుండి తీవ్ర ఆంక్షలు విధించిన్నట్లయితే సంబంధిత CP /SP/ DIG ని సంప్రదించ వలసినదిగా మనవి. డీజీ పీ ఆఫీస్ లో సైతం అడిషనల్ డీజీ (L&O) రవి శంకర్ అయ్యన్నార్ ( ) మరియూ DIG (L&O)(9908017338) రాజశేఖర్ బాబు (8008111070) అందుబాటులో వుంటారని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలియచేసారు.

భద్రత దృష్ట్యా ఎప్పటిలాగే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేశారు. పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వినాయక విగ్రహ ప్రతిష్ట సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* వినాయక విగ్రహ ప్రతిష్ఠ/పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లలో సమాచారం అందించాలి.
* ఫైర్, విద్యుత్ శాఖల అనుమతితో పాటు వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలి .
* పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి.
* మండపాల వద్ద క్యూ లను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం.
• రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.
• విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు, డీజే వంటివాటికిపైన ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

LEAVE A RESPONSE