పోలీసులపై తెరాస కార్యకర్తల దాడి.. సంజయ్ పర్యటనలో టెన్షన్

– సీఐకి గాయాలు
– బండి సంజయ్‌పై కేసు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రెండో రోజు టీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల ఐకేపీ సెంటర్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించేందుకు సంజయ్ వెళ్లగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు, చెప్పులు, కర్రలు విసురుకున్నారు. అర్వపల్లి దగ్గర పోలీసులపైకి దూసుకెళ్లారు TRS కార్యకర్తలు. కర్రలతో పోలీసులపై దౌర్జన్యం చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులను అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు TRS కార్యకర్తలు. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను వెంటనే పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
బండి సంజయ్ పర్యటన సందర్బంగా ఆత్మకూరు(s) మండలం కొనుగోలు కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇనస్పెక్టర్ సీఐ శ్రీనివాస్‌ అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేట ఆస్పత్రిలో శ్రీనివాస్ కు చికిత్స అందిస్తున్నార ఉదయం నుండి విధులు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతంతో పాటు ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించారని సంజయ్‌పై అభియోగం


మోపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదయింది. నల్గొండ రూరల్, మాడగులపల్లి, వేములపల్లి పీఎస్‌లలో బండి సంజయ్ పై కేసులు నమోదు చేశారు.
రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని విమర్శించారు.
సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ ఆటోలో ఉన్న కర్రలను స్వాధీనం చేసుకున్నారు. కొర్లపహా టోల్ ప్లాజా వద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు బీజేపీ నాయకులు వెళ్లకుండా తనిఖీలు చేశారు. 40 మందిని అదుపులోకి తీసుకున్నారు.
రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతాం:
రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని విమర్శించారు.సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ ఆటోలో ఉన్న కర్రలను స్వాధీనం చేసుకున్నారు. కొర్లపహా టోల్ ప్లాజా వద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు బీజేపీ నాయకులు వెళ్లకుండా తనిఖీలు చేశారు. 40 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply