ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయడం తుగ్లక్ చర్య

– జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్
విజయవాడ: విద్యార్ధుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయడం తుగ్లక్ చర్య. వేల కోట్లు విలువ చేసే ఆస్తులను దోచుకునేందుకే ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజులు చెల్లించగలరా అని ప్రశ్న.పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయడం దుర్మార్గం.జగన్ కపట నాటకాలు అందరికీ అర్ధమైపోతున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జి చేస్తారా ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా తమ అవినీతి మంత్రి వెల్లంపల్లి స్పందించరు. దేవుని ఆస్తులను దోచుకోవడం, దాచుకోవడమే ఆయనకు తెలుసు. సీఎం స్పందించి ఎయిడెడ్ నిర్ణయాన్ని మార్చుకోవాలి… లేకుంటే లక్షలాది మంది‌ విద్యార్థులు తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడించే రోజు వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply