– కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఉదయ్ ప్రయాణం
– సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు
అమరావతి: ఉదయ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లు అన్నారు. ధైర్యం అవిశ్రాంత కృషి ఉంటే ఏ కల కూడా పెద్దది కాదని రుజువు చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. దృఢ సంకల్పం ప్రతి అడ్డంకిని ఛేదించి కొత్త గమ్యస్థానాలను లిఖించగలదని అన్నారు. కష్టపడేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని మరోసారి రుజువు అయ్యిందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా ఉల్లపాలెంకు చెందిన ఎం. ఉదయ కృష్ణారెడ్డి ఆల్ ఇండియ ర్యాాంక్ 350 సాధించి ఐపీఎస్లో చేరినందుకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నుంచి పోలీస్ కానిస్టేబుల్ తరువాత ఐపీఎస్ ఆధికారి వరకు అతని ప్రయాణం ధైర్యసాహసాలు, త్యాగం, అవిశ్రాంత సంకల్పం నిజంగా స్ఫూర్తిదాయకమని అన్నారు.