మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నిరుపేద కూలీలను ఉద్దేశించి ప్రారంభించిన పథకం. ఈ పథకం ద్వారా మన రాష్ట్ర౦లో దాదాపు 60 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. రాష్ట్ర౦లోని 26 జిల్లాల్లో ఈ పథకం కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తతో అమలుచేస్తోంది.
పథకంలో పని చేస్తున్న వేతనదారులకు తక్షణ వేతన చెల్లింపుల నిమిత్తం 2022- 23 ఆర్ధిక సంవత్సరంలో మొదటి విడతలో భాగంగా తొలిసారి రూ.929.20 కోట్ల మొత్తానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మదర్ శాంక్షన్ ఇచ్చింది. ఈ మొత్తం నిధులు విడతల వారీగా, రోజువారీ వేతన ఎఫ్. టి. ఓల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయి.