జగన్ రెడ్డి పాలనంతా నిందితులకు రక్ష-బాధితులపై కక్ష

– దళిత యువకుడిని హత్య చేసిన వారిని వదిలేసి బాధిత కుటుంబ సబ్యుల్ని కొట్టడం ఏంటి ?
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడు సుబ్రమణ్యంని హత్య చేస్తే… వైసీపీ ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని మానసికంగా హత్య చేస్తోంది. పోలీసులు మార్చురి దగ్గర సుబ్రహ్మణ్యం భార్యను కొట్టడం దారుణం. తాడేపల్లి పెద్దల అదేశాలతో నే పోలీసులు వైసీపీ ఎమ్మెల్సి ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఏం సందేశం ఇస్తున్నారు ?నిన్న హత్య జరిగితే.. ఇప్పటి వరకు పోస్టుమార్టం ఎందుకు చేయలేదు ? పోస్టుమార్టం చేయాలని అడిగినందుకు వారి కుటుంబ సభ్యుల్ని కొడతారా ? తాడేపల్లి పెద్దల మాటలు విని పోలీసులు హత్యకు గురైన దళిత యువకుని కుటుంబానికి అన్యాయం చేస్తే చరిత్ర క్షమించదు. వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ని అరెస్టు చేయాలి.

Leave a Reply