తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో విజయ డెయిరీ ఉత్పత్తులు

వినియోగదారుల కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో, విజయ డెయిరీ ఆధ్వర్యంలో నూతనంగా ఉత్పత్తిని చేసిన 10, 20 రూపాయలు, 50 ML గల స్పెషల్ గ్రేడ్ అగ్ మార్క్ నెయ్యి ప్యాకెట్ లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి మార్కెట్ లోకి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలలో విజయ డెయిరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అనేక నూతన ఉత్పత్తులను మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అన్ని రకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పెద్ద ఎత్తున ఔట్ లెట్ ల ఏర్పాటు, ట్రై
tsy1 సైకిల్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న రోజులలో నూతన ఉత్పత్తులు అనేకం మార్కెట్ లోకి తీసుకొచ్చి నూతన ఔట్ లెట్ లను మరిన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ మార్కెటింగ్ GM మల్లిఖార్జున్, అధికారులు మల్లయ్య, కామేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ సిన్హాను సన్మానించిన మంత్రి
ఈరోజు పదవీ విరమణ చేస్తున్న పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.

Leave a Reply