Suryaa.co.in

Telangana

దైవసన్నిదానంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి..

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిదానానికి ప్రత్యేకత ఉందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ. ఫిలింనగర్ లోని దైవసన్నిదానంలో ఉన్న అయ్యప్పస్వామికి కాజా సూర్యనారాయణ తయారుచేయించిన బంగారు కిరీటాన్ని స్వరూపానంద స్వామిజీ, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మనందేంద్ర చేతుల మీదుగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహభాషణ చేస్తూ ఫిలింనగర్ లోని దైవసన్నిదానంలో దేవతలందరూ కొలువుదీరారని, అటువంటి దేవాలయంలో యాగాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందన్నారు. అందులోనూ ఈరోజు అయ్యప్ప స్వామికి చేసిన బంగారు కిరీల దారణతో మరింత ప్రాముఖ్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఇక్కడి దేవాలయాలను సందర్శించినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయని చెప్పారు. కార్యక్రమంలో దైవసన్నిదానం కమిటీ చైర్మన్ మోహన్ బాబు, కాజా సూర్యనారాయణ, పరచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE