Suryaa.co.in

Andhra Pradesh

గెలుపు అహంకారాన్ని పెంచలేదు

-బాధ్యతగా నడుచుకుంటాం
– చీకటిరోజులు పోయాయ్‌.. మెగా డీఎస్సీ నా బాధ్యత
-వ్యవస్థల్లో నేతల ప్రమేయాన్ని తగ్గిస్తాం
-గెలుపు అనంతరం జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు

అమరావతి: విజయం సాధించి జనసేన పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్ల ప్రస్తానంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుపొందని జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది అశ్యర్యపరిచింది. ఇక జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి మెజారీ ఆధిక్యతతో గెలుపొందారు.

జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ జనసేన గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కక్ష సాధింపు విజయం కాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 కోట్ల మంది ప్రజలకు చెబుతున్నా.. ఆ చీకటి రోజులు అయిపో యాయి. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన సమయం ఇది. సినిమా ల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ అనే మూవీతో విజయం సాధించాను. ఈ రోజు 21 స్థానాలకు 21 గెలిచేవ వరకు మళ్లీ గెలుపు రుచి చూడలేదు.

గెలిచింది 21 స్థానాలే.. కానీ 175 స్థానాలు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత ఇచ్చారు ప్రజలు. బాధ్యతతో మేం పనిచేస్తాం. వ్యవస్థల్లో రాజకీయ నేతల ప్రమేయం అతితక్కువ ఉండేలా మేం చర్యలు తీసుకుంటాం. మెగా డీఎస్సీ ప్రకటించే బాధ్యత నాది. చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు నాకు. 2019లో ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నానో .. ఈరోజు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాను. గెలుపు నాలో అహంకారాన్ని పెంచలేదు. ఇల్లు అలకగానే పండగ కాదు. ధర్మం కోసం నిలబడితే..అదే ధర్మం ఈ రోజు మన వెంట నిలబడిరది. కనిపించని దేవుళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ను మాత్రమే గెలిపించలేదు. 5 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలిపిం చారు’ అంటూ పవర్‌ ఫుల్‌ స్పీచ్‌ ఇచ్చారు.

LEAVE A RESPONSE