Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలచేత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది

– నేటితో ఆరాచక సామ్రాజ్యానికి స్వస్తి
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అమరావతి: కూటమి గెలుపుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రజలు ఎప్పుడూ విఘ్నాతో ఆలోచిస్తారు. సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. గత ఐదు సంవత్సరాల నుంచి అరాచకం సృష్టించినందుకు ఈరోజు జగన్‌కు వచ్చిన ఫలితాలు నిదర్శనం. ఎంత దుర్మార్గంగా వ్యవహరిం చారో వైసీపీకి ఓట్లు వచ్చిన దానిని బట్టే తెలుస్తోంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు మాకు వచ్చిన అఖండ విజయమే చెబుతుంది. రౌడీలతో, గుండాలతో పాలన కొనసాగించి పేద ప్రజలను ఆర్థికంగా, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారనేది స్పష్టంగా ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. అది చేశాం, ఇది చేశామని చెప్పుకుంటూ పేపర్లో భూటకపు ప్రకటన ఇస్తే సరిపోదు.. క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును కూడా ప్రజలు గమనిస్తారు. వాలంటరీ వ్యవస్థలను పెట్టి అరాచకాలు చేశారు. దీని ప్రతిఫలమే ఈరోజు ఎన్నికల ప్రతిఫలం. నేటితో ఆరాచక సామ్రాజ్యానికి స్వస్తి పలికారు.. ప్రజలచేత ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE