అమరావతి రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదు

– డిప్యూటీ సి‌ఎం ధర్మాన కృష్ణదాస్
మబుగాం (పోలాకి): అమరావతి రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదు రాజకీయ రంగు పులుముకున్న యాత్రకే మేము వ్యతిరేకం. అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్ర.. అదో రియల్ ఎస్టేట్ యాత్ర.. భ్రమరావతి యాత్ర. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబే. అమరావతి భూములకు బినామీ చంద్రబాబే, ఈ ఉద్యమానికి బినామీ కూడా ఆయనే.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఈ టీడీపీ నాయకులు, శ్రేణులే ఉన్నారు. ఈ యాత్ర చేయిస్తున్నది నేనే అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా ? ఒక ఆన్యాయం నుంచి మరిన్ని అన్యాయాలకు దారి తీయాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలకు మారు పేరుగా ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. 13 జిల్లాలు, మిగతా ప్రాంతాలు, మిగతా సామాజిక వర్గాల వారిని కవ్విస్తూ యాత్ర సాగిస్తున్నారు.
ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం, చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టేలు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాలమీద దండయాత్ర కాదా?అన్ని ప్రాంతాల సమానాభివృద్దికి మా నాయకుడు సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. మేనిఫెస్టోలో ఆయన ఏం చేస్తామని చెప్పారో దాన్ని దైవంగా భావించి చేసి చూపిస్తున్నారు.

Leave a Reply