సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండిస్తున్నాం

– దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– వైసీపీ కార్యకర్తలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?
– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్

అధికార మదంతో వైసీపీ నాయకులు కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాలను సరిచేసుకొని ప్రజలకు మంచి చేయాలని సూచించిన ఆర్యవైశ్య వర్గానికి చెందిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడాన్ని ఖండిస్తున్నాం.

ఆయన వైకాపాకు చెందిన కార్యకర్త అయినా విచక్షణారహితంగా దాడి చేసి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు. శాంతి, అహింసకు ప్రతిభింభాలుగా ఉండే ఆర్యవైశ్యులంటే ఎందుకు జగన్ రెడ్డికి అంత కక్ష. జగన్ రెడ్డి చేతగాని పాలనను ప్రశ్నించిన వారిపై ఇలానే దాడులు చేస్తామన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ పన్నిన కుట్రలో భాగంగానే సుబ్బారావు గుప్తాపై తెగబడ్డారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ కార్యకర్తలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందస్తు అరెస్ట్ చేసే అధికారపక్షం ఇంత వరకు సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పోలీసుల చేతగానితనానికి నిదర్శనం. రాబోయే ఎన్నికల్లో ఆర్య వైశ్యులే జగన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారు.

Leave a Reply