దేశంలో కార్పొరేట్ సర్కార్ వద్దు- కిసాన్ సర్కార్ కావాలి – శుభప్రద్ పటేల్

– కర్ణాటక ముందర్గిలో జరిగిన రైతు బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యలు శుభఫ్రద్ పటేల్

రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వ్యవసాయరంగ పథకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని కితాబిచ్చారు. కర్ణాటకలో రాష్ట్రం గదగ్ జిల్లా ముందర్గి స్టేడియంలో కిసాన్ జాగృతి వికాస్ సంఘ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు.

కిసాన్ జాగృతి వికాస్ సంఘం ఆధ్వర్యంలో అక్కడ 75 జంటల సామూహిక వివాహాలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలకు శుభప్రద్ పటేల్ వివరించారు. అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగునీటి సదుపాయం, 24 గంటల ఉచిత కరెంట్ తో తెలంగాణ రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం నిర్మించి తెలంగాణ పంటలో సస్యశామలంగా మారిందన్నారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నారని శుభప్రద్ పటేల్ తెలిపారు. తెలంగాణలో పెళ్లిల్లు జరిగితే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంతో లక్షా నూట పదహారు రుపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైతు సర్కార్ పాలన ఎలా నడుస్తోందో దేశంలో కుడా కిసాన్ సర్కార్ పాలన ఎంతో అవసరమన్నారు.

కార్పొరేట్ (ఆదాని, అంబానీ) పాలన వద్దు, కిసాన్ సర్కార్ పాలన కావాలి అనే నినాదంతో సభలో రైతులందరిని హోరెత్తించారు. కన్నడలో మాట్లాడుతూ.. ”ముందిన గల్లల్లి కార్పొరేట్ సర్కార్ తగదుబెట్టి కిసాం సర్కార బర్ బేకు, నువెళ్ల కై జోడించి కిసాన్ సర్కార మాడబేకు” అంటూ జై కిసాన్ నినాదాలతో అక్కడి రైతులను శుభప్రద్ పటేల్ ఉత్సహపరిచారు. దేశంలో తెలంగాణ లాంటి కిసాన్ సర్కార్ అవసరం అన్న మాటకు అక్కడి రైతులు పెద్ద ఎత్తున్న చప్పట్లతో హోరెత్తించారు. జై కిసాన్ సర్కార్ అంటూ అక్కడి రైతులు మద్దతు పలికారు.

అనంతరం రైతు సంఘం నాయకులు మఠాధిపతులతో కలిసి కలిసి గోపూజ, నాగలి పూజ ధనరాశి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు గారు, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి గోవింద్ రావు పలువురు కర్ణాటక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply