Suryaa.co.in

Telangana

ఫీనిక్స్‌ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటాం

– ఫలితాలు నిరాశపరిచాయి
-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందన

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బ లు ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయి. అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాల కు చేరుకుంటామన్న విశ్వాసం ఉంది. ఫీనిక్స్‌ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE