Suryaa.co.in

Andhra Pradesh

ఖాకీ బట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా?!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో టిడిపి సానుభూతిపరులైన మత్స్యకారులను వైసిపిలో చేరాలి లేదా రూ.2లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్తసోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వైసిపి నేతలకు తొత్తుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించడమే గాక పార్టీ మారాలని వత్తిడిచేయడం, ఆత్మహత్యకు పురిగొల్పడం యావత్ పోలీసు శాఖకే మాయనివచ్చ. ఖాకీబట్టలు వేసుకొని వైసిపి నేతలకు ఊడిగం చేయడం దారుణం. దేశంలో మరెక్కడైనా ఇలాంటి విపరీతపోకడలు ఉన్నాయా?

బిసి సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు మరికొద్దిరోజుల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో కఠినచర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

LEAVE A RESPONSE