Home » ఉద్యోగుల జీపీఎఫ్‌.. సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై సీఐడి ఎప్పుడు కేసు పెడుతుంది?

ఉద్యోగుల జీపీఎఫ్‌.. సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై సీఐడి ఎప్పుడు కేసు పెడుతుంది?

– రాష్ట్రంలో AP సీఐడి కేసులపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆసక్తికర ట్వీట్
-చిట్ ఫండ్ కంపెనీలపై కేసులను, ఆర్థిక శాఖలో నిధుల తరలింపును లింక్ చేస్తూ ట్వీట్

చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయి అని తమకున్న అనుమానంతో…..  ఫిర్యాదులు లేకున్నా రాష్ట్రంలో సీఐడి కేసులు పెట్టి, అరెస్ట్ లు చేస్తోంది. సరే.! మరి ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము రూ. 486 కోట్లు వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు. ఇది నేరం కాదా? ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై సీఐడి ఎప్పుడు కేసు పెడుతుంది? చిట్ ఫండ్ కంపెనీల విషయంలో అనుమానంపైనే కేసులు పెట్టిన సీఐడి ….ఉద్యోగుల సొమ్ము మాయం అయినట్లు నిర్థారణ అయినా ఎందుకు కేసులు పెట్టడం లేదు?

Leave a Reply