Suryaa.co.in

Telangana

రాహుల్ గాంధీ ఎక్కడకు పోయారు?

– తెలంగాణలో క్షీణించిన శాంతిభద్రతలు
డీఏ లు లేవు.. ఏక్ పోలీసింగ్ ఎటు పోయింది?
సాయి రెడ్డి సూసైడ్ నోట్ పై ఎందుకు కేస్ పెట్టలేదు?
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: సంవత్సరం కాలంలో శాంతి భద్రతలపై ఇవాళ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చినప్పటి నుండి 2023 చివరి వరకు ఎంతో మంది మాటలు ,అంచనాలను పటాపంచలు చేస్తూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ మొదటి నిర్ణయం లోనే 700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. దేశంలోనే శాంతిభద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది.

నిన్న డిజిపి వార్షిక మీడియా సమావేశంలో అన్ని అంశాలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రానికి హోమ్ మంత్రి లేడు. ఇద్దరు డిజిపిలు మారారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. పోలీస్ నియామకాలు దాదాపు ఎస్సైలు, కానిస్టేబుల్ 40 వేల నియామకాలు చేపట్టారు. ఒక్క సంవత్సరం లోనే శాంతిభద్రతల ఇంత దారుణంగా క్షీణించాయి.

నిన్న డీజీపీ కొన్ని లెక్కలు మాత్రమే మీడియా ముందు పెట్టారు. జగిత్యాల లో పెట్రోల్ బంక్ లో పోలీస్ లపై కాంగ్రెస్ వాళ్లు దాడి చేస్తే కూడా కేస్ పెట్టలేని పరిస్థితి. మీడియాలో సోషల్ మీడియాలో పోలీస్ లపై వార్తలు రావడంతో అప్పుడు జగిత్యాల ఎస్పీ కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం హత్యలు 40 శాతం పెరిగాయి.అత్యాచారాలు పెరిగాయి. 82 శాతం 18 సంవత్సరాల లోపు ఉన్న మహిళలపై అత్యాచారాలు పెరిగాయి.

ఆనాడు కేసీఆర్ షి టీమ్స్ పెట్టారు మహిళల కోసం.ఎక్కడ పోయాడు ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి. రాజ్యాంగం ను రక్షిస్తాను అంటాడు రాహుల్ గాంధీ. మరి ఎక్కడకు పోయారు గంజాయి స్మగ్లింగ్ పెరిగింది. ఎక్కడ పోయారు? సైబర్ క్రైమ్ కేస్ లు 50 శాతం పెరిగాయి.ఎక్కడ పోయారు సైబర్ క్రైమ్ పోలీసులు?

సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వాళ్ళ మీద మాత్రమే నిఘా పెట్టారు తప్ప బెట్టింగులు, లోన్ అప్స్,డిజిటల్ అరెస్టులపై దృష్టి పెట్టడం లేదు. గాంధీ భవన్ నుండి ఏ ఫిర్యాదు తీసుకోవాలని చెప్తే , అదే ఫిర్యాదు మీద బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారు పోలీసులు.

లగచర్ల లో తిరుపతి రెడ్డి నేతృత్వంలో కరెంట్ బంద్ చేసి, ఇంటర్నెట్ తీసేసి గిరిజన మహిళల ను వేదించారు. వాళ్ళు స్వయంగా నేషనల్ హుమెన్ రైట్స్ ముందు చెప్పారు. పోలీసులు ఇవాళ ధర్నా చేస్తున్న పరిస్థితి వచ్చింది. డీఏ లు లేవు. ఏక్ పోలీసింగ్ ఎటు పోయింది? స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఇవాళ ఏమైంది. పోలీసుల ఆత్మహత్యలు పెరిగాయి వాటిపై మాట్లాడడం లేదు.

కొండారెడ్డి పల్లిలో సాయి రెడ్డి అనే మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు దానిపై మాట్లాడలేదు డీజీపీ. కొండారెడ్డి పల్లిలో రుణమాఫీ గురించి కవరేజ్ కు వెళ్తే, మహిళ జర్నలిస్టులపై దాడి చేశారు దానిపై మాట్లాడడం లేదు. తిరిగి జర్నలిస్టులపైననే కేసులు పెట్టారు. సాయి రెడ్డి సూసైడ్ నోట్ పై ఎందుకు కేస్ పెట్టలేదు? ఎమ్మెల్యేలపై కూడా పోలీస్ పట్టించుకోలేదు కాకపోగా తిరిగి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేసు పెట్టారు. పోలీసుల ఆత్మహత్యలపై ఎందుకు ఎవరు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి అంతర్ భద్రతలో స్పెషల్ పోలీస్ లను తీసివేసి, ఎఆర్ వాళ్ళను పెట్టారు.దీనిపై ఎందుకు మాట్లాడడం లేదు?

ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నేతలు కురవ విజయ్ కుమార్ , అభిలాష్ రంగినేని ,తుంగ బాలు , వీరబాబు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE