ఎన్నికలు వస్తే ఆలయాలు బిజెపి వాళ్ళకి గుర్తుకొస్తాయా ?

– పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

అభివృద్ధి జరగలేదని ఒక శాసనసభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యాడు.బిజెపి, కేసీఆర్ బహిరంగ సభలకు జనాలు వచ్చారని చెపుతున్నారు .. ఎన్నికల సమావేశాలకి ప్రజలు రాలేనిది ఉందా?.రాజకీయ పార్టీల మీటింగ్ లకు జనం వస్తారు.ఎట్లా వస్తారో అందరికి తెలుసు.

గతంలో గ్రేటర్ ఎన్నికల్లో చార్మినార్ దగ్గర ఆలయం లో అమిత్ షా మొక్కి వెళ్ళాడు.సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నిన్న అమిత్ షా దర్శించుకున్నాడు… ఎన్నికలు వస్తే ఆలయాలు బిజెపి వాళ్ళకి గుర్తుకొస్తాయా ?

మొన్న కేసీఆర్, నిన్న అమిత్ షా మునుగోడులో మీటింగ్ పెట్టారు .ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మోసం చేసింది బిజెపి కాదా ? బిజెపి అధికారంలోకి వస్తే..సెప్టెంబర్ 17విమోచన దినం జరుపుతామని అంటున్నారు.ప్రజలను రెచ్చగొట్టడంలో బిజెపి ముందు ఉంటది.నిన్న బహిరంగ సభలో అమిత్ షా ఈ 8 సంవత్సరాలు బిజెపి ఎం చేసిందో చెప్పాడా ?నీళ్లు ,నిధులు ,నియామాకులు అన్న నీవు కృష్ణ జలాల్లో వాటా ఎంతో తెలియకుండా ఈ ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశావ కేసీఆర్.

విద్యుత్ సంస్థలు బాకీలున్నాయ్ అని ప్రైవేట్ పరం కోసం నోటిఫికేషన్ వేయడం సిగ్గు చేటు. కేసీఆర్ 8ఏళ్ళు కేంద్రంపై ఎక్కడ పోరాటం చేశావు?కృష్ణా జలాలపై తెలంగాణ వాటా ఎంత అని మునుగోడు ఎన్నికల ముందు అడుగుతావా?ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టే కుట్ర చేస్తున్నావ్ కేసీఆర్ పూర్వీకులు ఎక్కడ?కేసీఆర్ దోపిడీ దారుడని చెప్పిన బిజెపి నేతలు.. ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు.రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి జరగడం లేదని రాజీనామా చేసాడు.అంటే వచ్చే ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి అయితదా ..కేంద్ర నిధులు వస్తాయా?దేశంలో బిజెపికి, రాష్ట్రంలో టీఆరెస్ కు మూడే సమయం దగ్గర పడింది.

Leave a Reply