ఈ దరిద్రం మనకు చాలదు అన్నట్లు ఇప్పుడు దేశాల మీద పడతడట

– కేసీఅర్ కొత్త జాతీయ పార్టీ పై YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

నర్సాపూర్ : ఈ దరిద్రం మనకు చాలదు అన్నట్లు ఇప్పుడు దేశాల మీద పడతడట. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తడట.ఇక్కడ రైతులు,నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోవడం తెలియదు.ఇంట గెలిచి రచ్చ గెలవాలి.గూట్లో రాయి తియ్యనోడు ఏట్లో రాయి తీస్తడట.బంగారు తెలంగాణ అయ్యిందా..? ఎవరికి అయ్యింది బంగారం?కేసీఆర్ కుటుంభానికి అయ్యింది బంగారం.ఆయన కొడుకులకు, అల్లుళ్లకు అయ్యింది బంగారం.8 ఏళ్లలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది. రైతులకు బరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Leave a Reply