తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన వైఎస్సార్‌ పెన్షన్‌ పంపిణీ:పెద్దిరెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైందని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.తెల్లవారుజాము నుంచే ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గ్రామ, సచివాలయాల ఆధ్వర్యంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు లబ్దిదారులకు పెన్షన్‌ అందజేస్తున్నారు. ఈ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయి. ఇందుకోసం 1417.53 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా లబ్దిదారులకు ఇంటింటి తిరిగి వాలంటీర్లు పెన్షన్లను ప్రతి నెల 1వ తేదిన లబ్దిదారులకు అందజేస్తున్నారు. ఇంటివద్ద అందుబాటులో లేనివారు మాత్రమే పెన్షన్‌ను అందుకోలేకపోతున్నారు.వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల సొంతూరులో కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న లబ్దిదారులు ఎక్కడైనా పెన్షన్‌ను అందుకునేలా ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.లబ్దిదారులందరికీ పెన్షన్‌ అందిచాలనే లక్ష్యంతో జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Leave a Reply