Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి డెవలప్ మెంట్ ఫండ్ కు 1 లక్ష విరాళం

మండపేట నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్స్ అమరావతి డెవలప్ మెంట్ ఫండ్ కు రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు సదరు చెక్కును బుధవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావుకు అందజేశారు. ఈ సంధర్బంగా కేబుల్ ఆపరేటర్స్ అందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, కోలుపోటి సత్యనారాయణమూర్తి (అబ్బు), పర్వతిన వీర్రాజు, గొడవర్తి ఎర్రబ్బు, మేకా జేజిబాబు, తదితర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE