Suryaa.co.in

National

140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో పార్లమెంట్‌లో భద్రత

-ఫోటోగ్రఫీ-వీడియోగ్రఫీ నిషేధం
-140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టనున్నారు. 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మోహరించారు. దీనితో పాటు, పార్లమెంట్ భవనం ఆవరణలో ఫోటోలు లేదా వీడియోలు తీసుకోవద్దని పార్లమెంట్ ఉద్యోగులను ఆదేశించింది.

జనవరి 19న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, “భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ ఒకటి. వ్యూహాత్మక భద్రతా ఏర్పాట్లలో భాగంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఫోటోగ్రఫీ మరియు వీడియో మేకింగ్‌పై నిషేధం కూడా ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగమే.

కెమెరాలు, స్పై కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు క్యాంపస్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లోని అధికారులు, ఉద్యోగులకు, పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న ఇతర సహాయక ఏజెన్సీలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎలాంటి ఫోటోగ్రఫీ అనుమతి లేదని తెలిపింది.

పార్లమెంట్‌లో బడ్జెట్ సెషన్‌లో సిబ్బంది, వారి లగేజీని పరీక్షించడానికి 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మోహరించారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ భద్రతలో లోపాలను దృష్టిలో ఉంచుకుని గత నెలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది బందోబస్తుకు ఆమోదం తెలిపారు. సోమవారం నాడు 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పార్లమెంట్‌ భవన సముదాయం భద్రతను చేపట్టారు.

సీఐఎస్‌ఎఫ్ యూనిట్‌కు అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని, 36 మంది అగ్నిమాపక సిబ్బందిని కూడా యూనిట్‌లోకి చేర్చుతారని వర్గాలు తెలిపాయి. జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే తమ బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండేందుకు వీలుగా ఇప్పటికే అక్కడ ఉన్న ఇతర భద్రతా సంస్థలతో పాటు పార్లమెంట్ సముదాయాన్ని బృందం సమీక్షిస్తోందని ఆయన చెప్పారు.

కొత్త, పాత పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లపై సీఐఎస్‌ఎఫ్‌కు నియంత్రణ ఉంటుందని, ఇక్కడ విమానాశ్రయం లాంటి భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ వ్యక్తులు, వస్తువులను ఎక్స్‌రే యంత్రాలు, మెటల్ డిటెక్టర్‌లతో పరీక్షించడం జరుగుతుంది. బూట్లు, భారీ జాకెట్లు, బెల్ట్‌లను ట్రేలలో నిల్వ చేయడానికి, వాటిని ఎక్స్-రే యంత్రాలతో తనిఖీ చేయడానికి కూడా సదుపాయం ఉంది.

పార్లమెంట్ భద్రత కోసం శాశ్వత ప్రాతిపదికన 140 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఫోర్స్ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. సిఐఎస్‌ఎఫ్‌లో దాదాపు 1.70 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.

LEAVE A RESPONSE