Suryaa.co.in

Telangana

ధాన్యం కొనుగోళ్లకు 20 వేల కోట్ల నిధులు

– ఖరీఫ్ లో రికార్డ్ స్థాయి ధాన్యం దిగుబడి
– 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
– సన్నాలకు ప్రోత్సాహకరంగా 500 బోనస్
– సాగునీటి రంగానికి 28,000 కోట్లు
– జనవరి నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం
– సస్యశ్యామలంగా సూర్యాపేట జిల్లా
– సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధికారులు,వివిధ రంగాలలో నిష్ణాతులు,కవులు కళాకారులతో గవర్నర్ సమావేశం
– సూర్యాపేట గవర్నర్ సభలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి

సూర్యాపేట: ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లకై 20 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఖరీఫ్ పంట రికార్డ్ స్థాయిలో దిగుబడి కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందన్న అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గురువారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా అధికారులతో పాటు జిల్లాకు చెందిన వివిధ రంగాలలో నిష్ణాతులు,స్వాతంత్ర్య సమర యోధులు,సమాజ సేవకులతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసంలో రాష్ట్రంలోనీటిపారుదల అభివృద్ధిని, సూర్యాపేట ప్రాశస్త్యాన్ని గవర్నర్ కు వివరించారు. ముందెన్నడూ లేని రీతిలో తెలంగాణా రాష్ట్రంలో సన్నాలు పండించినందుకు గాను 500 రూపాయల బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

తెలంగాణా రాష్ట్రాన్ని సశ్యశ్యామలంగా రూపు దిద్దేందుకు గాను నీటిపారుదల రంగం మీద 28,000 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. ప్రాజెక్ట్ ల నిర్మాణాలతో పాటు అనకట్టల ఆధునీకరణ పనులను వేగవంతంగా జరిపేందుకు గాను ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతి సంవత్సరం కొత్తగా సాగులోకి లక్ష ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అన్నారు.మొత్తం ఈ ఇదేండ్ల కాలంలో 30 లక్షల కొత్త ఆయకట్టును సాగులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి నుండి రాష్ట్రంలో తెల్ల కార్డు దారులందరికి సన్న బియ్యం అందించనున్నట్లు ఆయన చెప్పారు.

సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.ఇప్పటికే వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తున్న సూర్యాపేట జిల్లా సిమెంట్ పరిశ్రమలు,రైస్ మిల్లులతో పారిశ్రామిక రంగంలోను అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందన్నారు.చారిత్రాత్మకమైన నేపద్యానికి సూర్యాపేట బలమైన పునాదులు వేసిందన్నారు.

జాగీర్దారులకు, జమీందారుల,వ్యతిరేకంగా ఉద్యమించింది ఈ గడ్డ మీద నుండే నని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. నైజాం కు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధ రైతంగా పోరాటానికి ఊపిరి లూదినది కుడా ఇక్కడి నుండే నని ఆయన గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడ్డా, అభివృద్ధి లో తెలంగాణా రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందన్నారు.

చిన్న రాష్ట్రం అయినా ఆర్థికాభివృద్ధితో సుసంపన్నంగా నిలదొక్కుకుందన్నారు. పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు బారులు తిరుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్న జిష్ణుదేవ్ వర్మ కు వివరించారు.

LEAVE A RESPONSE