Suryaa.co.in

Andhra Pradesh

ఆరు నెలల్లోనే 3 లక్షల పెన్షన్ల కోత

– పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్ష
– రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్ల తొలగింపునకు కుట్ర
– అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 3 లక్షల పెన్షన్ల కోత
– మానవత్వం లేకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం
– వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయో నాటికి మొత్తం పెన్షన్లు : 66,34,742
– పెన్షన్ ల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం : రూ.92,547.66 కోట్లు
– పెన్షన్‌కు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు
: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడి
– కూటమి ప్రభుత్వం ఏర్పడిన జూన్‌ నుంచి ప్రతి నెలా పెన్షన్లు తగ్గింపు
– ఈ 6 నెలల్లోనే ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారు
– ఈ ఆరునెలల్లో కొత్తగా పెన్షన్ కోరుతూ 2 లక్షల దరఖాస్తులు
– లబ్ధిదారుల వెరిఫికేషన్ ముసుగులో పెన్షన్ల తొలగింపు
– వైఎస్ఆర్ సిపి నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైయస్ఆర్ సిపి నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా మూడు లక్షల పెన్షన్ లను తొలగించారని, భవిష్యత్తులో భారీగా పెన్షన్ల కోతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. అందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.92,547.66 కోట్లు
అధికారం చేపట్టాక, అట్టహాసంగా, నానా హంగామా చేస్తూ, ఆ రూ.4 వేలు పెన్షన్లు పంచారు. కూటమి ప్రభుత్వ కుట్ర, కుతంత్రాలు మొదలయ్యాయి. ఒక చేత్తో ఇస్తున్నట్లు నటిస్తూ.. మరో చేత్తో కోత పెట్టే ప్రయత్నాలు ప్రారంభించాడు. జూన్‌ నుంచి ప్రతి నెలా పెన్షన్లు తగ్గిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు కట్‌ చేశారు. ఎన్నికలు జరిగిన నాటికి వైయస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డిసెంబరు నాటికి వాటి సంఖ్య 63,20,282 పెన్షన్లకు తగ్గించారు. అంటే ఆరు నెలల్లో ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు తగ్గించారు.

చంద్రబాబు హామీలు నిజం అని నమ్మి కొత్తగా పెన్షన్‌ల కోసం దాదాపు 2 లక్షల దరఖాస్తు చేశారు. వాటిని మంజూరు చేయకుండా ఉన్న పెన్షన్లకే కోత పెట్టారు. ఆ కోత సరిపోదంటూ, కొత్తగా వెరిఫికేషన్‌ మొదలుపెట్టారు. పెన్షనర్ల వెరిఫికేషన్‌లో స్థానిక సచివాలయలకు కానీ, మండలానికి కానీ సంబంధం లేదు. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్‌ చేయాలని నిర్దేశించారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన, ఒక్కో బృందం 40 మంది లబ్ధిదార్లను వెరిఫికేషన్‌ చేస్తారు. గ్రామ జనాభా, పెన్షనర్ల సంఖ్యను బట్టి, ఆ బృందాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఎనిమిది పారామీటర్స్‌ నిర్దేశించారు. చివర్లో వారు పెన్షన్‌కు అర్హులా? కాదా? అన్న ఒక ఆప్షన్‌ పెట్టారు. అధికారి ఒక టిక్‌తో ఆ పెన్షనర్‌ భవిష్యత్‌ను మార్చేసే ప్రక్రియ మొదలైంది.

వైయస్సార్‌సీపీకి మద్దతు పలికారని.. వృద్దులని కూడా చూడకుండా పెన్షన్లు తొలగించారు. కొందరి పేర్లు­న్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌ నుంచి బదిలీచేశారు. పెన్షనర్లను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. తామున్న సచివాల­య పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్‌ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలా­మంది సతమతమవుతున్నారు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలోనే అరాచకం

పెన్షన్లు ఆపడం, ఇతర జిల్లాలకు బదిలీ చేయడం, పార్టీలు మారితే కానీ పెన్షన్ ఇవ్వము అనేది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకర్గంలో జరుగుతోంది. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, గతం నుంచి అమలు జరుగుతున్న పథకాలను కూడా ఆపేస్తామంటున్న కూటమి ప్రభుత్వ విధానాలను ఎలా అర్థం చేసుకోవాలి. ఆరు నెలలు తిరక్కుండానే కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు పెన్షనర్ల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకపోగా, అమలు చేస్తున్న వాటిలో కూడా కోత పెడుతున్నారు. ప్రతి వైఫల్యానికి గత ప్రభుత్వాన్ని నిందించడం, ఏ పని చేయకున్నా, అన్నీ చేస్తున్నట్లు తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం.. చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.

LEAVE A RESPONSE