- నేడు వెయి కిలోమీటర్లు మైలు రాయిని దాటిన బండి సంజయ్
- ప్రజా సంగ్రామ యాత్ర చిహ్నంగా పాలకుర్తిలోని అప్పిరెడ్డిపల్లె స్టేజీ వద్ద ‘పైలాన్’ ఆవిష్కరణ
- భారీ ఎత్తున సంబురాలకు సిద్ధమైన కార్యకర్తలు
- వెయ్యి బెలూన్లు.. వెయ్యి షాట్స్.. డప్పు వాయిద్యాలతో హంగామాకు సిద్ధమైన నాయకులు
తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడంతోపాటు టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కి.మీల మైలు రాయిని అధిగమించడంతో అందుకు చిహ్నంగా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లెవద్ద స్టేజీ వద్ద స్థానిక పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా ‘పైలాన్‘ను నిర్మించారు.
మరికొద్ది నిమిషాల్లో బండి సంజయ్ కుమార్ అక్కడికి చేరుకోని పైలాన్ ను ఆవిష్కరించబోతున్నారు. తమ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర వెయ్యి కి.మీల మార్క్ దాటడంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు సిద్ధమయ్యారు. వెయ్యి బెలూన్లు ఎగరేయడంతోపాటు వెయ్యి షాట్స్ (బాణాసంచా) పేల్చనున్నారు. దీంతోపాటు డప్పు వాయిద్యాలతో, కార్యకర్తల న్రుత్యాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
తొలివిడత నుండి నేటిదాకా
మొదటి విడత పాదయాత్ర ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై అక్టోబర్ 2న హుస్నాబాద్ లో ముగిసింది. తొలివిడతలో మొత్తం 36 రోజులపాటు పాదయాత్ర చేసి 438 కి.మీలు నడిచారు. 19 అసెంబ్లీలో 9 జిల్లాలు, 6 ఎంపీ సెగ్మెంట్లలో పాదయాత్ర చేశారు.
అట్లాగే రెండో విడత పాదయాత్రను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మే 14న ముగించారు. మొత్తం 31 రోజులపాటు పాదయాత్ర చేసిన సంజయ్ 3 ఎంపీ, 9 అసెంబ్లీ, 5 జిల్లాల మీదుగా 383 కి.మీలు నడిచారు.
తాజాగా కొనసాగుతున్న మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై నేటికీ 15 రోజులు. పైలాన్ ఆవిష్కరించే సమయానికి 183 కి.మీలు నడక పూర్తయింది. వెరసి రేపటికి పాలకుర్తి నియోజకవర్గంలోని వెయ్యి కి.మీల మైలు రాయిని దాటి 1001 కి.మీలోకి అడుగు పెట్టడం గమనార్హం.
ఈ 82 రోజుల పాదయాత్రలో అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వివిధ సమస్యలపై వేలాది దరఖాస్తులను స్వీకరించారు. వాటి పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం.