రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లు గా మారాయి

– ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ఆర్బీకేలు రైతుల నుండి సరిగా ధాన్యం కొనరు.. కొద్దో గొప్పో కొన్నా, రైతుకి వెంటనే వాటి డబ్బు చెల్లించరు.ఎరువులు అధిక ధరలకు అమ్ముతారు.. రైతులకు ఎరువులపై స్వల్పకాలిక రుణం కూడా ఉండదు.. రైతు మాత్రం డబ్బు చెల్లించే ఎరువులు కొనాలి. పోనీ కావాల్సిన ఎరువులన్నీ ఆర్బీకేల్లో దొరుకుతాయా అంటే అన్నీ దొరకవు. ఎప్పుడు చూసినా ఎరువుల కొరతే.

అధికారులు, వైసీపీ నాయకులు కుమ్ముక్కై నకిలీ రైతులను నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేసారు. మొత్తం కొనుగోళ్లపై లెక్కలు తీస్తే ఎన్ని వేల కోట్లు కాజేశారో తేలుతుంది. ధరల స్థిరీకరణ కు 3000 కోట్లు, విపత్తులకు 6000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వేటికీ దిక్కు లేదు. ఆర్బీకే భవనాలకు అద్దెలు కూడా సరిగా చెల్లించరు. ఈ పరిపాలనను మించిన విపత్తు మరొకటి లేదు.

ధాన్యం బస్తాపై 200 వరకూ కమీషన్ గుంజుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారాయి.అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత? ఎంత మొత్తంలో ఎరువులు ఆర్బీకే ల వద్ద ఉన్నాయి? ఎంత మొత్తం ఆర్బీకే ల ద్వారా ఇచ్చారు? అలానే.. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పండించిన పంట ఎంత? అందులో ఆర్బీకే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? దానిలో రైతులకు పెట్టిన బకాయిలు ఎంత? అనే విషయాలపై ఈ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.

Leave a Reply