శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి

– అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ

కలియుగ దైవం కొలువైన శ్రీ వెంటకేశ్వర స్వామి పుణ్య క్షేత్రం తిరుమల.నిన్న శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నిన్న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినిత్ శరన్, సంజయ్ కిషన్ కౌల్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి మలయప్పస్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. జాహ్నవి కపూర్ కు అర్చకులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో స్వామి వారిని దర్శించుకోవడం అందరిని ఆకర్షించింది.

Leave a Reply