Suryaa.co.in

Entertainment

సినిమా స్క్రీనింగ్ కోసం లంచం

– హీరో విశాల్ ఆరోపణలు

‘మార్క్ ఆంటోనీ’ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కోసం తాను లంచం చెల్లించాల్సి వచ్చిందని హీరో విశాల్ తెలిపారు.ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉందని.. మూవీ స్క్రీనింగ్ కోసం రూ.3లక్షలు, సర్టిఫికేట్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర CM, PM మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్లు చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

LEAVE A RESPONSE