Suryaa.co.in

Entertainment Telangana

తెలుగు చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషిదాయకం

తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషిదాయకం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ ను అందుకున్న కలర్ ఫోటో మూవీ చిత్ర దర్శకులు సందీప్ రాజ్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి తనకు లభించిన అవార్డు, ప్రశంసా పత్రాన్ని మంత్రి కి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి సందీప్ రాజ్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గత నెల ౩౦ వ తేదీన డిల్లీ లో జరిగిన 68 వ జాతీయ ఫిలిం అవార్డ్ వేడుకల్లో కలర్ ఫోటో తెలుగు మూవీ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయినదని డైరెక్టర్ సందీప్ రాజ్ మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో యాదవ్ సంఘం రాష్ట్ర యువజన నాయకులు నవీన్ యాదవ్, రాహుల్ యాదవ్, ప్రదీప్, వంశీరెడ్డి, గంగాధర్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE