Suryaa.co.in

Entertainment

ఒకే వేదికపై చిరు-బాలయ్య.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటారని సమాచారం.
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘ఆహా'(OTT Platform Aha) ఓ టాక్ షో నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే'(Unstoppable With NBK) అని నామకరణం చేశారు. ఈ టాక్ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ఇందులోని తొలి ఎపిసోడ్‌లో మంచు మోహన్ బాబు అతిథిగా రానున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.

LEAVE A RESPONSE