Suryaa.co.in

Andhra Pradesh Entertainment

రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా థియేటర్

ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ . రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ ధియేటర్ ను రూపొందిస్తున్నారు. “పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని,ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభం కాగలదని సంస్ధ ప్రతినిధి చెప్పారు. ఆచార్య సినిమాతో ఈ హాల్ ప్రారంభమౌతుందని ఆన్నారు. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపం.

LEAVE A RESPONSE