ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాలకు పైగా చేయడంతో పాటు నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ స్పందిస్తూ, తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని పేర్కొంటూ, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ కు, తెలంగాణ రాష్ట్ర బి.జె.పి. ప్రెసిడెంట్ బండి సంజయ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నిర్మాతలు నట్టి కుమార్, జె.వి.మోహన్ గౌడ్ తదితరులు శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…