Suryaa.co.in

Andhra Pradesh Entertainment Telangana

‘స‌ర్కారువారి పాట’ సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అనుమ‌తి

– టికెట్‌పై రూ.45 పెంపున‌కు అనుమ‌తి
– 10 రోజుల పాటు పెరిగిన రేట్ల‌తోనే టికెట్లు
– ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం స‌ర్కారువారి పాట చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి నిచ్చింది. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయా సినిమాల విడుద‌లకు ముందు స‌ద‌రు సినిమా నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసి త‌మ బ‌డ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు, స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది.

 

LEAVE A RESPONSE