రాష్ట్రంలో అరిస్టోక్రాటిక్ పాలన

– జగన్ రెడ్డి అసమర్ధ పాలనతో యువత భవిష్యత్ ప్రమాదంలో పడింది
– నవ్యాంధ్ర నవనాడులను నలుచుకుతింటున్న అవినీతి, అరాచక, అసమర్ధ పాలకుల్ని యువత తరిమికొట్టాలి
– టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

ఎన్నికలముందు యువతకు అనేక హామీలిచ్చి వారి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి నెత్తిన భస్మాసుర హస్తం పెట్టారు. డొల్ల పరిపాలనలో యువతకి ఉపాధి కల్లగా మిగిలిపోయింది. అధికారంలోకి రాగానే మొట్ట మొదట చేసే పని ఖాళీగా వున్న 2.30 లక్షల ప్రభుత్వ ఉధ్యోగాలు భర్తీ చేయ్యడమేనన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని యువతని బులిపించి అధికారంలోకి వచ్చారు. మూడేళ్లు దాటినా ఎటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకుండా నిరుధ్యోగులను వంచించారు.

ఉధ్యోగ, ఉఫాది కల్పనలో రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించక పోవడంతో రాష్ట్రంలో నిరుధ్యోగ యువత భవిత ప్రశ్నార్ధకమయింది. ఏటా లక్షలు ఖర్చు పెట్టి వివిధ కోర్సులు పూర్తి చేసి బయటికి వస్తున్న యువతకి ఉధ్యోగ, ఉపాది చూపే విధానాలు అమలు చేసే సమర్ధత ఈ ప్రభుత్వానికి లేదు. భాధ్యత, సమర్ధత లేని,అబద్దాల పరిపాలనలో యువత భవిత ప్రమాదంలో పడింది.

వైసీపీ పాలనలో రాష్ట్రంలో కొత్తగా వచ్చే పెట్టుబడులేవు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ సంక్షోభం కారణంగా చదువుకొన్న విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. పలువిభాగాల్లో కాళీగా వున్నఉద్యోగాల భర్తీకి కార్యాచరణ లేదు. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయి,రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు లేక నవ్యాధ్రoలో నిరుద్యోగాభివృద్ది దిన,దినాభివృద్ది చెందుతుంది. నిరుద్యోగం పెరిగి అసమానతలు పెరిగిపోతున్నాయి. 75 శాతం పరిశ్రమల్లో స్ధానికులకే ఉద్యోగాలన్న జగన్ రెడ్డి కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగపోగా ‎ కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్ ను నాశనం చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే తూచ్ అని వారిని రెగ్యులైజ్ చేయకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేశారు. ఏపీపీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి వ్యవస్ధ ప్రతిష్ట మంటగలుపుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే జగన్ రెడ్డి రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్లు, సబ్సిడితో బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్టకొట్టారు. C.M.I.E నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్స్ అన్ ఎంప్లాయిమెంట్ రేటు 33.6 శాతానికి పెరిగి బీహార్ సరసన చేరింది. దీనికి కారణం ఎవరో, జగన్ రెడ్డి పాలనలో యువతకు జరిగిన అన్యాయంపై యువత ఆలోచించాలి.

ఉద్యోగం,ఉపాది,శిక్షణ అందుబాటులో లేక యువత కుంగుతున్న తీరు ఆందోళనకరం. యువతలో ఆశలు పెంచారు ఆచరణ లో విఫల మయ్యారు. ప్రత్యేక హోదా సాధించి ఉధ్యోగాల విప్లవం తెస్తానని యువతకు ఆశపెట్టిన జగన్అధికారంలోకి వచ్చాక హోదా పై పిల్లిమొగ్గలు వేసి తన కేసుల మాఫీకోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. అడుగడుగునా వంచించే ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యువత వివేకవంతం కావాలి. వాస్తవాలు తెలుసుకొని తమ సమస్యలు పరిష్కారం కొరకు సంఘటిత పోరాటం చెయ్యాలి. నవ్యాంధ్ర నవనాడులను నలుచుకుతింటున్న అవినీతి, అరాచక, అనైతిక, అసమర్ధ పాలకులని రాష్ట్రం నుంచి యువత తరిమికొట్టాలి.

Leave a Reply