Suryaa.co.in

Andhra Pradesh Entertainment

ఏపీలో సినిమా టికెట్ ధరల ఖరారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీఎస్టీ, థియేటర్ల నిర్వాహణను మినహాయించి టికెట్‌ ధరను గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో , కార్పొరేషన్‌లోని నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం- ప్రీమియం ధరలు ₹40-₹60గా ఉండగా, ఏసీ థియేటర్లలో ₹70-₹100గా, స్పెషల్‌ థియేటర్లలో ₹100-₹120గా, మల్టీపెక్స్‌లో ₹150-₹250గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం- ప్రీమియం ధరలు ₹30-₹50గా, ఏసీ థియేటర్లలో ₹60-₹80గా, స్పెషల్‌ థియేటర్లలో ₹80-₹100గా, మల్టీపెక్స్‌లో ₹125-₹250గా నిర్ణయించింది.
cinema1
cinema2

LEAVE A RESPONSE