Suryaa.co.in

Andhra Pradesh Entertainment

అనాథ శరణాలయంలో పవన్ కళ్యాణ్ సతీమణి ప్రీ క్రిస్మస్ వేడుక

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనా కొణిదెల ని హోమ్ నిర్వాహకులు సత్కరించారు.

LEAVE A RESPONSE