Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో రాజకీయ వలసలు ప్రారంభం…జగన్ సినిమా అయిపోయింది

– 3 నెలల్లో ఇంటికి పోతూ…ఇప్పుడు విశాఖ పోతాను అంటున్నాడు
– రాష్ట్ర ప్రజల కోసం ఈ యాగం చేశా
ఎమ్మెల్యేలను కాదు…జగన్నే మార్చాలి
ఒక్కరికి అయినా ఈ ప్రభుత్వంలో లాభం జరిగిందా?
నాయకుడు అనే వాడికి విశ్వసనీయత ఉండాలి
– పెదకూరపాడులో ఎమ్మెల్యేతో దొంగ వ్యాపారం చేయించింది జగన్
•టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీలో చేరికలు
• పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చేరికల సభలో నారా చంద్రబాబు నాయుడు

• రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డేలేదు. కృష్ణా నదికి అడ్డుగా కట్టవేసి ఇసుకను దోచేశారు.
• పెదకూరపాడు ఎమ్మెల్యే రెండు జిల్లాల్లో ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారు.
• ఇసుక దోపిడీపై ప్రశ్నిస్తున్న వారిపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. పిడి యాక్టు పెట్టి జైల్లో పెట్టారు.
• ఇసుక దోపిడీ పై ఎవరూ ప్రశ్నించకుండా కేసులు పెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతున్నాను.
• రాష్ట్రంలో రాజకీయ వలసలు ప్రారంభం అయ్యాయి. జగన్ ను ఇంటికి పంపాలని జనం చూస్తున్నారు.
• తన సినిమా అయిపోయిందని జగన్ కు అర్థం అయిపోయింది.
• జగన్ కు తన సంగతి తెలిసిపోయింది అందుకే 92 మంది ఎమ్మెల్యేలను మారుస్తాడు అంట
• ఎమ్మెల్యేలను కాదు…జగన్నే మార్చాలి.
• రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆక్వా రైతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నారు. హర్టికల్చర్ రైతులు నాశనం అయ్యారు.
• ఒక వ్యక్తి విధానాల వల్ల వ్యవస్థలు నాశనం అయితే జీవితాలు నాశనం అవుతాయి. ఈ ఐదేళ్లలో ఇదే జరిగింది.
• నేను ఈ మూడు రోజులు రెండు యాగాలు చేశాను. రాష్ట్ర ప్రజల కోసం ఈ యాగం చేశాను. సుదర్శన నారసింహ యాగం, చండీ యాగం చేశాను.
• నాకు పదవులు కొత్త కాదు…నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేరు. నా ఆలోచన అంతా తెలుగు ప్రజల గురించే.
• నేడు రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ కలుగుతుంది. ఆవేదన కలుగుతుంది.
• ఒక్క చాన్స్ పాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో నిస్సహాయతలో ఉన్నారు. మన రాత తిరిగి రాసే శక్తి మన చేతుల్లోనే ఉంది.
• ఒక రైతు, ఇక ఆటోడ్రైవర్, ఒక నిరుద్యోగిని అడుగుతున్నా…ఒక్కరికి అయినా ఈ ప్రభుత్వంలో లాభం జరిగిందా
• తుఫాన్ వంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ సాయంతో కష్టం తగ్గించవచ్చు. కానీ మొన్న తుఫాన్ వస్తే ప్రభుత్వం కనీసం స్పందించలేదు.
• పంట కాలువల నిర్వహణ కూడా చేపట్టలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నా.
• ప్రతి ఏడాది జగన్ జాబ్ క్యాలండర్ అన్నాడు. ఇచ్చాడా…ఒక్క పరిశ్రమ తెచ్చాడా
• గాది రాజు ప్యాలెస్ గురించి ఈ రోజు పేపర్ లో చూశాను.
• విశాఖలో గాదిరాజు ప్యాలెస్ పై జగన్ రెడ్డి కన్ను పడింది. దీంతో ఆ ఇల్లు కావాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఇంటి యజమాని ఇల్లు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన ఆస్తి 22 ఎ లో ఉందని అధికారులు నోటీసులు ఇచ్చారు.
• 1994లో ఆ స్థలం కొనుగోలు చేసిన యజమాని అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అది 22 ఎలో ఉందని నోటీసు ఇచ్చారు.
• విషయం మీడియాలో రావడంతో ఇప్పుడు ఆయనను బెదిరించి తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పించారు.
• గుంటూరు శంకర్ విలాస్ యాజమాని రంగనాయకమ్మ ను కూడా ఇలాగే బెదిరించారు. ప్రభుత్వంపై ఆమె ఒక పోస్ట్ పెట్టిందని….వ్యాపారం దెబ్బతీశారు. వేధించారు. దీంతో ఆమె రాష్ట్రం వదిలి వెళ్లిపోయింది
• నాయకుడు అనే వాడికి విశ్వసనీయత ఉండాలి. మద్య పాననిషేదం చేయకపోతే ఓటు అడగను అన్న వ్యక్తి…..ఇప్పుడు మద్యంపై అప్పు తెచ్చాడు. ఇదీ అతని విశ్వసనీయత
• మొన్న జగన్ బర్త్ డే జరిగింది. నేను ఒక ట్వీట్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేశాను.
• నేను వ్యక్తులపై యుద్దం చేయను…సిద్దాంతాల కోసం పోరాటం చేస్తాను.
• జగన్ పుట్టిన రోజు ఘనంగా చేసుకుంటే తప్పులేదు. కానీ అయన పుట్టిన రోజు కోసం ఏకంగా 100 కోట్లు పెట్టి సాక్షికి ప్రకటనలు ఇప్పించుకున్నాడు. ప్రభుత్వ శాఖలతో ప్రకటనలు ఇప్పించడం ఏంటో అర్థం కావడం లేదు.
• నేను అద్దె ఇంట్లో ఉంటే దానిపైనా అనేక దాడులు చేశాడు.
• వచ్చే ఎన్నికలు నా కోసమో…జనసేన కోసమో కాదు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఈ ఎన్నికలు.
• కేసులు పెడతారు అని ప్రజలు బయటకు రాకపోతే మీకు మీరే మరణ శాసనం రాసుకున్నట్లు అవుతుంది అంతా ఆలోచన చేయండి.
• నాకు పదవి ముఖ్యం కాదు.తెలుగు ప్రజలను నెంబర్ 1 చేయాలి అనేది నా ఆలోచన.
• నాడు మనం హైదరాబాద్ లో చేసిన అభివృద్దిని తరువాత ప్రభుత్వాలు కొనసాగించాయి.
• అమరావతిలో లక్షలో కోట్ల ఆస్తిని జగన్ నాశనం చేశాడు.
• ఇంకో మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్…ఇప్పుడు విశాఖ పోతాను అంటున్నాడు.
• రుషికొండ ను విధ్వంసం చేసి రూ. 500 కోట్లతో అక్కడ ప్యాలెస్ కడుతున్నాడు.
• రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి అన్ని వర్గాలు కలవాలి. రేపు జరిగే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి. జగన్ రాజకీయాలకే పనికి రాని వ్యక్తి
• నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ జగన్ లాంటి దారుణమైన సిఎంను చూడలేదు. ప్రతిపక్షాలపై దాడులు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
• రేపు జరిగే ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, పేద ప్రజలు ఆలోచించుకోవాలి. నేను అందరి వాడిని ఏ ఒక్కడి వాడిని కాదు.
• నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం చూడడం. తెలుగు వారిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడం నా లక్ష్యం. ఇది సాధ్యం అవుతుంది.
• నా జీవితానికి ఒక ఆశయం ఉంది. ఒక లక్ష్యం ఉంది. 45 ఏళ్ల అనుభవంతో చెపుతున్నా.. ఇంకా కష్టపడతాను. మీ రుణం తీర్చుకుంటాను.
• నేను సూపర్ సిక్స్ ఇస్తాను అని ప్రకటించాను. దీంతో సిఎం ఇప్పుడు నేను కూడా ఉచిత ప్రయాణం పెడతాను అంటున్నాడు.
• రాష్ట్రంలో మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు…మార్చవలసింది జగన్ ను.
• పెదకూరపాడులో ఎమ్మెల్యేతో దొంగ వ్యాపారం చేయించింది జగన్. ఇప్పుడు చెడ్డ పేరు వచ్చిందని ఎమ్మెల్యేను మారుస్తాను అంటున్నాడు.మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు. ఈ లెక్కన మారిస్తే జగన్ ను మార్చాలి.
• ఇప్పుడు రాష్ట్రంలో జనం భయపడడం లేదు. ప్రజలు ఓపెన్ గా చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. రాష్ట్రాన్ని పీడిస్తున్న శని జగన్

LEAVE A RESPONSE