సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు.. గత కొద్ది కాలంగా స్థానిక రెండో జేఎఫ్సీఎం కోర్టులో యందం ఇందిరా తరపున వాదనలు వినిపించారు న్యాయవాది ఏవీఎంఎస్ రామచంద్రరావు.. చివరకు పోసానిపై కేసులు నమోదు చేయాలంటూ కోర్టు పేర్కొంది.. ఇక, రెండవ జేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీసులు ఐపీసీ 354, 355, 500, 504, 506, 507 మరియు 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు .