ఎస్.. మీడియా వాటిపై మాట్లాడాలి

– మోహన్‌బాబు నోరు విప్పాలి
– వివేకా హత్యపై మీడియా మాట్లాడాలి
– వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా?
– పవన్ ఫైర్
జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ చాలారోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్ వేదిక నుంచి గళమెత్తి గర్జించారు. ఏపీలో సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానంపై విరుచుకుపడ్డారు. అది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని గర్జించారు. ప్రాధాన్యం లేని అంశాలపై హడావిడి చేసే మీడియా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడాలని ఘాటుగా వాతలు పెట్టారు. సినిమా పరిశ్రమ కష్టాలపై మోహన్‌బాబు మాట్లాడాలన్నారు. సినిమా పరిశ్రమతో పెట్టుకుంటే వైసీపీ వాళ్లు కాలిపోతారని కన్నెర్ర చేశారు.
సాయిధరమ్‌తేజ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అవి ఆయన మాటల్లోనే… సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరం.అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి.. సాయితేజ్. సాయితేజ్ ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చా.అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారు. సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారు. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడు. సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలుచేయడం కష్టం. సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదు.రాజకీయాల్లో దిగజారుడుతనంపెరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారు. వైఎస్ వివేకా హత్య గురించి మీడియా మాట్లాడాలి. కోడి కత్తితో ఒక నేతను పొడిచారు, ఆకేసు ఏమైంది? పోడుభూమి సాగు చేసుకునే గిరిజనులపై మాట్లాడాలి. వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు?


ఆరేళ్ల చిన్నారి ఘటనను వదిలేసి తేజ్ ప్రమాదంపై మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింస గురించి మాట్లాడాలి. సినిమా వాళ్ల గురించి కాదు.. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమా పరిశ్రమ సెన్సిటివ్ పరిశ్రమ. పవన్ సనిమాలను ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారు. మేం అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం లేదు. కష్టపడి నటిస్తేనే మాకు డబ్బులు వస్తాయి. అక్రమార్జిత రాజకీయ నాయకుల గురించి మాట్లాడండి. ట్యాక్స్ లు కట్టని వారి గురించి మాట్లాడండి.. మా గురించి కాదు . చిత్రపరిశ్రమ వైపు చూస్తే వైసీపీ వాళ్లు కాలిపోతారు. ఇండస్ట్రీ వైపు చూడొద్దని వైసీపీ వాళ్లకు ఎందుకు చెప్పడం లేదు.
అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు అని మనం చెప్పాలి .ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి? . ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్. ఇది వైసీపీ రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారు . సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవు . సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి. సినీ పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తా . సినిమావాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదు.. కష్టపడుతున్నారు.

నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా .సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్ష మంది బతుకుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు. సినిమావాళ్ల కష్టాలపై మోహన్ బాబు మాట్లాడాలి.చిత్ర పరిశ్రమ గురించి మోహన్ బాబు వైసీపీ నేతలకు చెప్పాలి.
ఇవే నిబంధనలు రేపు మోహన్ బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన.సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తీరు మారాలి. మీ వైఖరి మార్చేందుకు ఏం చేయాలో మాకు తెలుసు. తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు. ఆపలేరు .
పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు.
జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి, ఒళ్లువిరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయి. కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా? చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారు.. ప్రభావం మాత్రం చాలా పెద్దది. చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుక్కూర్చోమని చెప్పలేరా.. ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా? వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు.. అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు. అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. గఢాఫీ లాంటి నియంతల్నే చేసిన తప్పులు వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్లు కొట్టి చంపేశారు.
మీడియా దృష్టి పెట్టాల్సింది సినిమా వాళ్ల మీద కాదు.. అక్రమ అర్జిత రాజకీయ నాయకుల మీద.. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన అంశం.. అందుకే చాలా తేలిగ్గా టార్గెట్ చేసేస్తున్నారు.. ఉదాహరణకు తేజుకి బైక్ యాక్సిండెట్ అయితే దాని మీద విపరీతార్ధాలతో కథనాలు వేశారు. దేశంలో ఇంతకంటే ఇంట్రస్టింగ్ కథనాలు లేవా? వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు అనే దాని మీద మాట్లాడండి. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో పోడిస్తే, నాటి గవర్నర్ గారు సైతం దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు.. అది ఏమయ్యిందో అడగండి.
లక్షలాది ఎకరాల పోడు భూముల్లో గిరిజనలు వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు.. ఎందుక దక్కడం లేదనే అంశం మీద మాట్లాడండి. ఆరేళ్ల చిన్నారిని అన్యాయంగా, అమానుషంగా హ్యత చేస్తే దాన్ని వదిలేసి. తేజ్ 45 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లిపోయాడు అనే దాని మీద కథనాలు ఎందుకు? బాగా స్పైసీగా కథనాలు కావాలి అంటే.. ఈ మధ్య వైసీపీ సానుభూతిపరులు కొందరు, వ్యభిచారాన్ని చట్టబద్దం చేయమంటూ బయటకు వచ్చారు. దాని మీద కథనాలు నడపండి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి, వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనే అంశం మీద కథనాలు వేయండి.
రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో కథనాలు వేయండి.. బోయ కులస్తులకు ఎందుకు, రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదో దాని మీద కథనాలు నడపిండి.. నేను గౌరవిస్తాను. ఇడుపులపాయలో ఉన్న నేలమాళిగల్లో టన్నుల కొద్ది డబ్బుల కట్టలు ఉంటాయని, పోలీసు వారు చెప్పుకుంటుంటే విన్నా. దాని మీద కథనాలు నడపండి.. అలా నడిపితే వాళ్లు ఇళ్లలోకొచ్చి కడతారు.. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అతను అమాయకుడు ఏం చేయలేడు కాబట్టి!
సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారు.. సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదు. ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నంపెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండిచిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండి నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి . మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా .
మా సినిమా టిక్కెట్లు నువ్ అమ్మేదేంది? సన్నాసి మంత్రి. అప్పుల్లో ఉంది కాబట్టే సినిమా టిక్కెట్లు అమ్మి డబ్బు నొక్కేద్దామని చూస్తున్నారు. సినిమా వారు వ్యాపారం చేసుకోకూడదా ? సినిమా బడ్జెట్ చిన్నది కావొచ్చు ప్రభావం పెద్దది. వకీల్ సాబ్ సినిమా లేకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాలు రిలీజ్ అయి ఉండేవి.కులం చూసి బంధాలు పెంచుకోలేదు.వ్యక్తిత్వాన్ని చూసి పెంచుకున్నా.
సినిమా మేము తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా ?అమ్మడానికి మీరు ఎవరు ? సినిమా పరిశ్రమ సున్నితమైంది.పవన్ కళ్యాణ్ ఫై కోపం మీద లక్ష మంది సినీ కార్మికుల పొట్ట కొడుతున్నారు. నా ఫై కోపం ఉంటే నా సినిమాలు ఆపండి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉప రాష్ట్ర పతి పైనే దాడులు చేసిన జగన్ కు సినిమా వాళ్ళు ఒక లెక్క?
జగన్ ఫై గొడవ పడడానికి సిద్దమయ్యా -అందుకే మాట్లాడుతున్న. నాపై కోపాన్ని సినీ పరి ఇండస్ట్రీ ఫై చూపిస్తున్నారు. మమ్మలను తిడితే ఉరుకుంటారనుకోవొద్దు బయటకి లాగి తంతాం మోహన్ బాబు మాట్లాడాలి.. నైతిక బాధ్యత ఉంది.. ఇవాళ సీసీ సినిమాలు.. రేపు నీ విద్యా సంస్థలు!

Leave a Reply