Suryaa.co.in

Entertainment National

రాజు గారు అంటే రాజు గారే మరి…

-అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే
-రూ.50 కోట్లు పైగా ఖర్చు

అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే.

కోట్లాది మంది ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర కల త్వరలో నిరవేరబోతుంది. జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరగనుంది.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు.

ఈ భోజనాల కోసం అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ప్రారంభోత్సం జరిగే ఆ ఒక్క రోజు అన్నదానం కోసం 50 కోట్ల ఖర్చు అవుతోంది. ఆ మొత్తాన్ని తాను భరిస్తానని ప్రభాస్ ముందుకు వచ్చారు.

LEAVE A RESPONSE