Suryaa.co.in

Andhra Pradesh

అంబటి ఆధ్వర్యంలో అడ్డగోలుగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం

గుంటూరు: పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మాణం జరుగుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంతా అడ్డగోలుగా జరుగుతుంది. 2015లో రెండు సెల్లార్ లు, ఐదు ఫ్లోర్ లో కోసం అనుమతి తీసుకున్నారు.

2017లో 15 ఫ్లోర్ లకి అనుమతి అడగడం జరిగింది. ఇప్పటి వరకూ వాటికి ఎలాంటి అనుమతులు లేవు.ఈ వెంచర్ వెనుక పక్కన రెల్వే ట్రాక్ వెళుతుంది. రైల్వే పట్టాల నుంచి 75 అడుగుల దూరం వదిలి పెట్టాలని రైల్వే శాఖ ఎన్వోసీ ఇవ్వడం జరిగింది.రైల్వే ఎన్వోసీకి బిన్నంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి.

సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వానికి , కార్పొరేషన్ అధికారులను మోసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్ ట్రాఫిక్ ఎన్వోసీ, మైనింగ్ సెస్, ఇన్సురెన్సు పాలసీ ఉండాలి ఏ ఒక్కటి లేవూ. అధికారులు వాళ్లతో కుమ్మక్కు అయ్యారు.

సుమారు 5వందల మందికి పైగా వినియోగ దారులను మోసం చేశారు.. సామాన్యుడిపై ప్రతాపం చూపించే అధికారులు వీళ్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. వందల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వీళ్ల పై చర్యలు తీసుకోవాలి. రైల్వే అనుమతి కోసం ఒక ప్లాన్, కార్పోరేషన్ అనుమతి కోసం మరో ప్లాన్ ఇస్తారు.

ఇన్ని లోపాలు ఉన్నా ఇప్పటికి నిర్మాణం చేపట్టడానికి కారణం అయిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.నిర్మాణాలు ఆపి వినియోగదారులకు న్యాయం చేయాలి. అధికారులు స్పందించకపోతే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

LEAVE A RESPONSE