Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో దసరా సందడి!

– సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ
– దాతృత్వం చాటుకున్న చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు

మంగళగిరి: చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాద్ రావు సహకారంతో ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ అశోక్ బాబులు సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అమ్మవారి అశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభకాంక్షలు తెలిపారు.

రాక్షసులను సంహరించి మంచిని నిలిపిన.. ఆ మహిషాసుర మర్దిని అయిన దుర్గమ్మ దయతో.. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడి.. ప్రజలకు మంచి చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేయాలని పరితపించే చంద్రబాబు లాంటి మనసున్న నేతల పాలనలో.. ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దారు నాయక్, అరకు ఇన్‌చార్జి దొన్నుదొర, రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు, మీడియా కో ఆర్డినేటర్ ధారపునేని నరేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE