పార్టీ జెండాను భుజం పుండ్లుపడేలా మోసిన కార్యకర్తల ఆవేదనలతో.. గత మూడు నెలల నుంచి టీడీపీ సోషల్మీడియాలో హాహాకారాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో జగన్, ఆయన పార్టీ నేతల దాష్టీకాలు గుర్తు చేస్తూ, పార్టీ సోషల్మీడియాలో పెడుతున్న ఆవేదనాభరిత పోస్టింగులు, కార్యకర్తలలో ఆవేశం రగిలిస్తున్నాయి. జగన్ హయాంలో వెలిగిన అధికారులు, నాయకులే మళ్లీ తమపై పెత్తనం చేయడాన్ని సహించలేని తమ్ముళ్లు.. సోషల్మీడియా వేదికగా తమ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
తమ ఆవేదనను అవహేళన చేసి, తమ త్యాగాలు తక్కువచేసి సుద్దుల పలుకుతున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై, టీడీపీ సోషల్మీడియా సైనికులు ములుకుల్లాంటి పదాలతో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా లగడపాటి కృష్ణకుమారి అదే మహిళా కార్యకర్త, ‘ప్రజాప్రకటన’ పేరుతో పార్టీకి చెందిన సోషల్మీడియా గ్రూపులోనే.. మళ్లీ జగన్ వస్తే ఎవరినీ బతకనీయడు..యమ డేంజరంటూ చంద్రబాబును హెచ్చరిస్తూ రాసిన ఓ లేఖ, టీడీపీ సోషల్మీడియాలో చర్చనీయాంశమయింది.
లగడపాటి కృష్ణకుమారి రాసిన లేఖ యధాతథంగా..
ప్రజా ప్రకటన
వైసీపీ మళ్ళ జవసత్వాలు పుంజుకుని అధికారంలోకి వచ్చిందంటే…. చంద్రబాబు నాయుడు గారినీ భవిష్యత్తు తరాలు క్షమించవు గాక క్షమిoచవు. ఈ ఐదేళ్ళూ అభివృద్ధి చేయకపోయినా వచ్చే నష్టం లేదు. కలో గంజో తాగిబతుకుతాం! వాడిని స్వేచ్ఛగా వదిలేసి, మీరు చేసే అభివృద్ధి ఎంటో ఆలోచించండి పెద్దాయనా ! మీరు రాజకీయం చేసి వాడిని రాజకీయ సమాధి చేస్తేనే ఆంధ్రోడికి భవిష్యత్తు ఉంటుంది.
లేదూ.. నాకు అభివృద్ధే హాబీ అనుకుంటే.. మీరు చేసిన ఆనవాళ్లు ఉండవు అండి బాబుగారు. గుర్తుపెట్టుకోండి!! ప్రజలు ప్రాణాలకు తెగించి మీకు పట్టం కట్టింది ఈ రాక్షసుడిని శిక్షించి, వాడి బారి నుండి రక్షిస్తావు అనేగానీ.. మీరిస్తాను అన్న పథకాలకు, చేస్తాను అన్న అభివృద్ధికి ఆశపడి కాదు మహాప్రభో. ఇకనైనా దుష్టశిక్షణ మొదలెట్టక పోతే అతి త్వరలో ప్రజల్లో మార్పు చూడవలసి వస్తుంది. ఇది ప్రజా ప్రకటన.
ప్రేమతో..
పార్టీ కోసం ప్రాణం పెట్టే