విజయవాడ: పటమట నిర్మలా హై స్కూల్ లో గురువారం నిర్వహించిన మెగా తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల చురుకుగా పాల్గొనడంతో పూర్తి విజయవంతం అయ్యింది. పరస్పర సహకారం ఫలితంగా ప్రభుత్వ సూచనల అమలు దిశగా కార్యక్రమం సజావుగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కిల్ ఇండియా మిషన్ కన్సల్టింగ్ అడ్వైజర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ కేసి శివ శంకర్, నిర్మలా హై స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మాథ్యూ, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ గిబి ఆంటొనీ హాజరై తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘‘బాల్యం అనేది తియ్యని జ్ఞాపకం. అలాంటి అమూల్యమైన బాల్యాన్ని కోల్పోకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే’’ అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజంలో వేగంగా మారుతున్న ప్రతికూల ధోరణులు పిల్లలపై చెడు ప్రభావం చూపకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ ఆత్మీయ సమావేశం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధాలను బలోపేతం చేయడమే కాక, విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసింది.