– న్యూయార్క్లో ‘గ్రీన్ లీడర్షిప్’ అవార్డు
హైదరాబాద్: మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు.
ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్లో జరగనున్న 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్కు తెలియజేసింది. “గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం” అని వారు తమ లేఖలో పేర్కొన్నారు.