జగన్ రెడ్డి,ఆయన ప్రభుత్వం ఆడబిడ్డలకు భయపడుతోంది

-వారు గొంతెత్తినే భయంతో వణికిపోతున్న ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలి
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత

మహిళల్ని గౌరవిస్తాము.. మహిళలభద్రతే మాధ్యేయం..మహిళాసాధికారతే మాప్రభుత్వ లక్ష్యం అనిచెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన భజనబృందమంతా, ఆడబిడ్డలు గొం తెత్తినే ఎందుకంతలా వణికిపోతోందని, వారికి సమాధానంచెప్పుకోలేక పోలీసులసాయంతో ఎందుకు భయపెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత నిలదీశారు.సోమవారం ఆమె జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడిన వివరాలు.. ఆమెమాటల్లోనే క్లుప్తం గా మీకోసం…!

“ఆడదాన్ని కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉంటేఎంత…లేకపోతేఎంతా! ఆయన ఇంకా ఆపదవిలో కొనసాగితే తనతండ్రికే అవమానం అనిమేంఅంటాము. తనతండ్రి గౌరవం కాపాడేవాడే అయితే జగన్ రెడ్డి ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు మహిళలకు రక్షణ ఉందా? ప్రతిసారీ మేం ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయా లను చెబుతూనేఉన్నాం. కానీ పాలకులకు అవి అర్థంకావడంలేదు. తనమూడేళ్లపాలనలో మహిళలపై 1000కి దారుణాలు జరిగితే, వాటికి సమాధానంచెప్పలేకే జగన్ రెడ్డి ఆయన భజనబృందం ఆడవాళ్లపై ప్రతాపంచూపుతోంది. ఇలాంటివి చేస్తున్నందుకు మీకు సిగ్గు అనిపించడంలేదా? బయటకువచ్చి మీసాలు తిప్పి, తొడలు కొట్టి, సినిమా డైలాగులు చెప్పి, జబ్బలుచరచడం, అక్కడికిరండి.. ఇక్కడికి రండిచూసుకుందామనే వారంతా ఆడవాళ్లపై దాడులుచేస్తున్నారంటే వారు ఎలాంటి మగాళ్లో అర్థమవుతోంది.

ఏంచేతకాక, ఏమీచేయలేకే మహిళలపైప్రతాపం చూపుతున్నారు. సోషల్ మీడియాలో ఏదైనాపోస్ట్ పెడితేనే, జగన్ రెడ్డి, ఆయనపేటీఎం బ్యాచ్ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది? వైసీపీపేటీఎం కుక్కలు, మహిళల్ని అవమానిస్తూ, నీచాతినీచంగా అనేకసందర్భాల్లో అసభ్యకరమైన పోస్టింగ్ లు పెట్టారు. వారు ఎలా మాట్లాడిన, ఎంతలా అవమానించినా భరించాలా..తిరిగి స్పందించకూడదా? స్పందిస్తే, ప్రశ్నిస్తే దాడులుచేస్తారా? సోషల్ మీడియాలోపోస్టులుపెడితేనే ఓర్చుకోలేనివారు ..వారు అనేమాటలు, చేసే వికృతాలకు మహిళలుఎంతలా నొచ్చుకుంటారో ఆలోచించరా? నిన్న నెల్లూరులో టీడీపీ మహిళా నేత రేవతిపై, ఆమె భర్తపై పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ గూండాలు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల సాక్షిగా రేవతిపై జరిగిన దాడికి పోలీసులు సిగ్గుపడాలా? జగన్ రెడ్డి సిగ్గుపడాలా? అతనికి సిగ్గులేదని మాకుతెలుసు.. కానీ రేవతి విషయంలో పోలీసులబుద్ధి ఏమైంది?

మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి, మానాయకుడు లోకేశ్ గారికి మధ్యన జరిగిన సంభాషణల్ని ప్రస్తావిస్తూ, అనిల్ కుమార్ అక్రమలేఅవుట్లగురించి రేవతి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అదితప్పా? సోషల్ మీడియాపోస్టులకు ఉన్నవిలువ, ఆడబిడ్డల తాళిబొట్లకులేదా? అదే పోలీసులు టీడీపీ మహిళలు వారికిజరిగిన అన్యాయం, వేధింపులపైకేసులుపెడితే మాత్రం తీసుకోరు. ఎందుకంటే పోలీసులు వైసీపీ తొత్తులు. నెల్లూరు పోలీసులు మరీ తొత్తులుగా మారారు. వారికి జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచి వస్తున్నాయా… లేక వైసీపీ కార్యాలయం నుంచి వస్తున్నాయా?

వైసీపీ ప్రభుత్వం ఆడదానికి భయపడుతోంది, కాబట్టే పోలీసులసాయంతో ఆడవాళ్లపై దాడిచేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకమహిళ పోస్ట్ పెడితే దానికిపోలీసులే రంగంలోకి దిగి, ఆ అమ్మాయిని స్టేషన్ కు పిలిపించి కొట్టిస్తారా? ఆమె పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేయిస్తారా? వైసీపీ భయంతో వణుకుతోంది కాబట్టే, ఇలాంటి దురాగతాలకు పాల్పడు తున్నారు. నెల్లూరుపార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు పనబాకలక్ష్మి ప్రస్తుతం నిండుగర్భిణిగా ఉంది. ఆమె తెలుగుదేశంపార్టీ తరుపున గట్టిగా మాట్లాడుతుందని బెదిరిస్తారా? వాస్తవానికి ఆమెప్రసవం కోసం ఈరోజు ఆసుపత్రిలోచేరాలి. ఆ అమ్మాయిమీదఉన్న అక్కసుతో నాయుడుపేట టీడీపీ కార్యాలయాన్ని తగలెట్టేశారు. భూలక్ష్మి ప్రశ్నిస్తున్నతీరు, ఆమెగట్టిగా మాట్లాడుతున్న తీరుతో మీరు భయపడ్డారుకాబట్టే, బెదిరించడానికి కార్యాలయాన్ని తగలెట్టారు. మీరుచేసే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తెలుగు మహిళలు భయపడరని గుర్తుంచుకోండి.

తెలుగుదేశంలో ఉండే మహిళలంతా ధైర్యంతో, తెగింపుతోనే ఉంటారు. భయపెట్టి, కేసులతో తెలుగు మహిళల్ని అడ్డుకోలేరని గుర్తుంచుకోండి. ఆడవాళ్ల తాళిబొట్లను తెంచేసే కార్యక్రమానికి జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారముందని తాళిబొట్లతో ఆడుకుంటారా? మీరుచేసే వెధవపనులపై మేంమాట్లాడకూడదా? మీరుచెప్పింది వినక పోయినా, మీతప్పుల్నిఎత్తిచూపినా, మీఇంగితజ్ఞానాన్ని ఎత్తిచూపినా పోలీసులసాయంతో కేసులుపెట్టి, వేధిస్తారా? మీ వెధవపనులు తెలుసుకుంటే వారిని చంపేస్తారు కూడా. దానికి ప్రత్యక్షఉదాహరణ, వైసీపీఎమ్మెల్సీ తనవద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టిచంపేయడం. గతంలో రౌడీషీటర్ గా ఉన్న వ్యక్తిని జగన్ రెడ్డి ఎమ్మెల్సీని చేస్తే, అతనే మో సొంతడ్రైవర్ ని చంపేసి, దర్జాగా తిరుగుతున్నాడు.

జగన్ రెడ్డి ఎవరికైనా పదవులు ఇచ్చే ముందు వాడిపై ఎన్నికేసులున్నాయి.. ఎంత అక్రమార్జన చేశాడు? ఎన్నిహత్యలు, అత్యాచారాలు చేశాడు, వాడికి పదవిస్తే, మనకెంతఇస్తాడు..లాంటివే లెక్కలో వేసుకుంటాడు. అలాఆలోచించబట్టే, ఎమ్మెల్సీపదవికి ఎలాంటిఅర్హత, అనుభవంలేని అనంతఉదయభాస్కర్ ని మండలిసభ్యుడిని చేశాడు. వైసీపీఎమ్మెల్సీ అయితే మనిషిని చంపేస్తాడా? చంపిందికాక, శవాన్ని తనకారులోనే తీసుకెళ్లి, మృతుడికుటుంబంవద్ద పడేస్తాడా? ఎంతధైర్యముంటే ఆపనిచేయాలి? దళితుల్ని చంపినా వారేంచేయలేరన్నదే మీఉద్దేశం. కాబట్టే ఇంత దారు ణానికిఒడిగట్టారు. సుబ్రహ్మణ్యం భార్య, తనభర్తను చంపినవారిని శిక్షించాలని, అప్పటివరకు పోస్ట్ మార్టమ్ జరగనివ్వమని పట్టుబడితే, ఆమెపై పోలీసులు చేయి చేసుకుంటారా? ఒక ఆడదానికి సమాధానం చెప్పలేరా? వైసీపీ ఎమ్మెల్సీ తనడ్రైవర్ ని చచ్చిపోయేలా కొట్టడం పోలీసులకు సామాన్య విషయమా? సుబ్రహ్మణ్యం భార్య గట్టిగా మాట్లాడితేనే పోలీసులు హత్యకేసు నమోదు చేస్తారా?

సోషల్ మీడియాలో ఏదోచిన్న పోస్ట్ పెడితేనే రాత్రిపగలనే తేడాలేకుండా స్పందించే పోలీసులు, దళితయువకుడిని చంపినవ్యక్తిని అరెస్ట్ చేయలేక పోవడం సిగ్గుచేటుకాదా? దళితయవకుల్ని కొట్టిచంపినా, శిరోముండనాలు చేయించినా సీఐడీ వారికి అవేవీకనిపించవు. ఎక్కడో ఏదో జరిగితే, ఆఘటనకు ఏమాత్రం సంబంధంలేని మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ అధికారపార్టీఎమ్మెల్సీనే స్వయంగా ఒకడిని చంపితే, అది పోలీసులకు పట్టదా? ప్రభుత్వం చెప్పిందని, మాజీ మంత్రు లు, సొంతపార్టీఎంపీలను మాత్రం ఎక్కడున్నాఠక్కున పట్టుకొస్తారు. పోలీసులు వారి పనితనాన్ని, పవర్ ని ఎందుకు రాజకీయ నేతలకు అమ్మేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఎప్పటి కప్పుడు న్యాయంకోసం, రక్షణకోసం ఆడబిడ్డలు పోరాడితేతప్ప పోలీసులు స్వచ్ఛం దంగా స్పందించరా? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతినిధులైనా, పోలీసులైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని హెచ్చరిస్తున్నాం. ఆడవారిని ఏదైనా చిన్నమాటంటేనే ఒప్పుకోని సమాజం మనది. అలాంటిది గర్భిణి అనికూడా చూడకుండా మహిళను బెదిరిస్తారా? వైసీపీఎమ్మెల్సీ దళితయువకుడిని చచ్చేలాకొట్టినా, అతన్ని అరెస్ట్ చేయరా? తప్పులు చేసే వాళ్లు పోలీసులకుదొరకరు… ఆ తప్పుల్నిఎత్తిచూపేవాళ్లను మాత్రం వెంటనే పట్టు కొస్తారు.

ఆడబిడ్డలరక్షణకోసం వారికి గన్ లైసెన్స్ లు ఇప్పించాలని ఇదివరకే డిమాండ్ చేశాము. ఈప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేదనిఅర్థమైంది. మగాళ్లము అనిచెప్పుకునేవారు, మగాడని భజనచేసేవారు.. ఆడబిడ్డలను నిజంగాకాపాడలేరని అసమర్థులని తేలిపోయింది. రేపు మాప్రభుత్వం రాగానే మహిళలను వేధించేవారందరి భరతంపడతాం. ”

Leave a Reply