– సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడంపై సీఎం సమీక్ష.
– తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణకు ఆదేశం
– బైజూస్తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై చర్చ
– విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్), డిజిటల్ లెర్నింగ్ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం.
సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తాం. సీఎం
ఆ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను లోడ్ చేయాలి.
దీనికి తగినట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి.
ఇవి నిర్దారించాక ట్యాబ్ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలి.
టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలి.
8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలి.
అంటే మూడేళ్లపాటు ట్యాబ్ నాణ్యతతో పనిచేయాలి.
అందుకే నిర్వహణ కూడా అంత్యంత ముఖ్యం.
ఏదైనా సమస్య వస్తే.. వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
నిర్దేశిత సమయంలోగా ట్యాబ్లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలి.
మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోండి.
అలాగే తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి.
విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామన్న అధికారులు.
ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలన్న సీఎం.
తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్, బ్లాక్ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలన్న సీఎం.
బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా.. అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలన్న సీఎం.
ఇప్పటికే డిజిటల్ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్న సీఎం.
వీటి వల్ల సైన్స్, మాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయన్న సీఎం.
వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది.
స్క్రీన్ మీద కంటెంట్ను హైలెట్ చేసుకునేలా, ఎనలార్జ్ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుందన్న సీఎం.
డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలన్న సీఎం.
దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలన్న సీఎం.
జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధంచేయాలి – అధికారులకు సీఎం ఆదేశం.
ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, సర్వ శిక్షా అభయాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.