Suryaa.co.in

Telangana

అంబేడ్కర్ మనుమడికి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని పరిచయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ లో స్థాపించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా సీఎం కేసీఆర్ మా తమ్ముడు అంటూ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్ కు పరిచయం చేశారు. ఈ మేరకు ఆయన సుభాష్ రెడ్డి ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్ ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సుభాష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల తనకు ఈ అవకాశం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE