విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. సీఎం​కు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు సీఎం బయలుదేరారు. వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

2,61,516 మందికి రూ.261.51 కోట్ల లబ్ధి
2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్‌ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కల్పించనుంది. ఒక్కో లబ్దిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లనుvahanamitra శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసినట్లవుతుంది.

Leave a Reply