Suryaa.co.in

Editorial

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు

– కేంద్ర ఎన్నికల సంఘం

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

LEAVE A RESPONSE